Sunday, May 18, 2025
HomeTelangana56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలి

56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలి

కేకే మీడియా నేరేడుచర్ల ఆగస్టు 29

జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు.గురువారం ఆయన నేరేడుచర్లలో బీసీ ముఖ్య నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ జనాభాలో 12 శాతం ఉన్న ఎస్సీలకు రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించారని, అలాగే గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ ఉన్నదని,56 శాతం ఉన్న బీసీలకు ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదని, ఆయన ప్రశ్నించారు.
బీసీల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని, ఐక్యత ఎంతో అవసరమన్నారు.
బీసీ కుల గణన చేపట్టి, ఆయా కులాల జనాభా ప్రాతిపధికన చట్టసభల్లో సీట్ల కేటాయింపు చేయాలన్నారు. సమావేశంలో మఠంపల్లి మండల సిపిఐ కార్యదర్శి అమరారపు పున్నయ్య, బీసీ హక్కుల సాధన సమితి నాయకులు రావుల సత్యం, ఊదర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments