న్యూఢిల్లీ కేకే మీడియా ఆగస్టు6:
కేవలం 30 వేల రూపాయలతో షాపింగ్ చేశారు మాజీ ప్రధాని షేక్ హసీనా.
బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో పదవిని , దేశాన్ని వదిలి కట్టుబట్టలతో ఇండియాకు వచ్చారు షేక్ హసినా
ఆందోళనకారుల హింస మధ్య అకస్మాత్తుగా దేశాన్ని వీడిన మాజీ పీఎం షేక్ హసీనా కట్టుబట్టలతో ఇండియాకు వచ్చారు.
ప్రాణ భయంతో దుస్తులు, వ్యక్తిగత వస్తువులు సైతం వెంట తెచ్చుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి.
దీంతో హసీనా యూపీలోని హిండన్ ఎయిర్బస్లో రూ.30 వేలతో షాపింగ్ చేసినట్లు పేర్కొన్నాయి.
ఈరోజు ఆమె లండన్ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.