*దేశంలో 2026 నాటికి నక్సలిజం పూర్తిగా అంతం: అమిత్ షా*
వచ్చే ఏడాది 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ‘దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం 2015లో ఇవి 35 ఉండగా.. 2018 నాటికి 30కి తగ్గాయి. 2021నాటికి 25కు వచ్చాయి. తాజాగా వాటి సంఖ్య 6కు చేరింది.’ అని అన్నారు. నక్సల్ రహిత భారత్ను నిర్మించే దిశగా మరోమైలు రాయిని చేరుకున్నామని అమిత్ షా అన్నారు.