Tuesday, December 9, 2025
HomeNationalగాయపడిన వారికి 1,50,000 ఉచిత వైద్యం

గాయపడిన వారికి 1,50,000 ఉచిత వైద్యం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.50 లక్షల వరకూ నగదు రహిత ఉచిత చికిత్సను అందించడానికి వీలుకల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని పేర్కొంది. ప్రమాదం జరిగిన ఏడు రోజుల్లోగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. నిర్దేశిత ప్రమాణాలు కలిగి, నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. పోలీసులు, ఆసుపత్రులు, స్టేట్‌ హెల్త్‌ ఏజెన్సీల సహకారంతో ‘రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025’ను జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) అమలు చేస్తుంది. రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.పథకం అమలు, ఆసుపత్రులను పథకంలో చేర్చడం, బాధితులకు చికిత్స, ఆసుపత్రులకు చెల్లింపులు తదితర అన్ని విషయాలను ఎన్‌హెచ్‌ఏతో సమన్వయం చేసుకొనే బాధ్యత ఈ నోడల్‌ ఏజెన్సీదే. పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments