హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 23
హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నలమాత ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాలు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా శనివారం నాడు సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్ కు రానున్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టి లేటుగా వస్తున్న లేటెస్ట్ గా తనతోపాటు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో సుమారు మూడువేల ఇండ్లు తను గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 80 శాతం పనులు పూర్తి పదేళ్లుగా ఇలాంటి అభివృద్ధికి నోచుకోని పేదల గృహాల సముదాయమైన పనిగిరి కొండ వద్దకు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వస్తుండడం విశేషం.
ఎన్నో ఏండ్లుగా నిరుపేదలు ఆశల సౌధమైన ఫణిగిరి కాలనీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాను నిర్మించిన కాలనీ తానే పూర్తి చేసి పేదలకు త్వరితగతిన అందిస్తానని చేసిన వాగ్దానం పూర్తి చేసుకునేందుకు మంత్రిని స్వయంగా అది మొదటిసారి వచ్చే క్రమంలోనే వందలాదిమంది నిరుపేదలకు ఉపయోగపడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తున్నందుకు ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం మంత్రి ఉత్తం 24న ప్రతి ఏటా పాల్గొని మఠంపల్లి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గం తో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు నిమగ్నమయ్యారు.