కేకే మీడియా నేరేడుచర్ల ఆగస్టు 27
నేరేడుచర్ల పట్టణ మండల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ వర్క్ షాప్ ను పట్టణ పార్టీ కార్యాలయం నందు నిర్వహించారు
ఇ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకురాలు, బిజెపి సభ్యత్వ జిల్లా కన్వీనర్ చల్ల శ్రీలతరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటివారం నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి నేరేడుచర్ల పట్టణం మండలాలలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని అన్నారు
100 సభ్యత్వాలు చేసిన వారికే క్రియాశీల సభ్యత్వం వస్తుందని క్రియాశీలక సభ్యత్వం వచ్చిన వారికే పట్టణ, మండల, జిల్లా స్థాయిలో పదవులు వస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పోలింగ్ బూత్ లో సభ్యత్వాలు చేయాలన్నారు
ఈ సమావేశంలో నేరేడుచర్ల పట్టణ బిజెపి సభ్యత్వ ఇన్చార్జిలుగా తాళ్ల నరేందర్ రెడ్డి, ఊర్మిళ రామ్మూర్తి, అమిరెడ్డి శంకర్ రెడ్డి లను, నేరేడుచర్ల మండలం సభ్యత్వ చింతలకుంట్ల రాజేష్ రెడ్డి , గోడెట్టి పవన్, చింతలచెరువు సతీష్ లను నియమించారు
నేరేడుచర్ల పట్టణ మండల అధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి పార్థన బోయిన విజయకుమార్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాల వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొనతం నాగిరెడ్డి, బిజెపి నాయకులు పరమేష్ రెడ్డి, బక్కిరెడ్డి, సమ్మేట నాగరాజు, వెన్నమ్ సురేష్, పూర్ణచంద్రర్ రావు, సైదా నాయక్, బాలు నాయక్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు