చిన్న ముఠా హమాలీ కార్మికులకు సన్మానం
నేరేడుచర్ల ఏప్రిల్ 6… నేరేడుచర్లలో పద్మా ఫర్టిలైజర్ స్థాపించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం స్థానిక శ్రీ కోదండ రామాలయంలో చిన్న ముఠా హమాలీ కార్మికులను ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పద్మ ఫర్టిలైజర్ మాజీ మేనేజింగ్ పార్ట్నర్, ప్రముఖ వ్యాపారవేత్త రావులపల్లి ప్రసాద్ ప్రస్తుతం నేరేడుచర్లలో లేకున్నప్పటికీ స్థానిక ప్రజల అవసరాలను గమనించి మున్సిపాలిటీకి వైకుంఠ రథం, నేరేడుచర్ల గరిడేపల్లి పాలకీడు మండలాలొ పలు గ్రామాలకు ఫ్రీజర్ల బహుకరణ, మున్సిపాలిటీ లో ని సిబ్బందిని, ఆశా వర్కర్లను, ప్రస్తుతం చిన్న ముఠా కార్మికులు చేసిన సేవలను గుర్తించి సన్మానించి వస్త్రాలు బహుకరించడం అభినందనీయమన్నారు, అంతేకాకుండా లయన్స్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, విద్య వైద్య రంగాలలొ విరాళాలు అందజేస్తూ నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న రావులపల్లి ప్రసాద్ సేవలు అమోఘమని కొనియాడారు, మొదట పద్మ ఫెర్టిలైజర్ మేనేజింగ్ పార్ట్నర్ ఇంజం బాలయ్య మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు, తాము ముఠా కార్మికుల అయినప్పటికీ 40 సంవత్సరాల తమ సేవలను అనుబంధాన్ని గుర్తించి సన్మానించడం పట్ల ముఠా కార్మికులు ఆనంద వ్యక్తం చేశారు, నేరేడుచర్లకు మరొక ఫ్రీజర్ విరాళంగా అందజేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్ కోరగా ప్రసాద్ అంగీకరించారు,ఈ సమావేశానికి మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి అధ్యక్షత వహించగా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ కొణతం సీతారామరెడ్డి, రామాపురం మాజీ సర్పంచ్ చింతమల్ల సైదులు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జిలకర రామస్వామి, ప్రముఖ న్యాయవాదులు సుంకర కాంత్ కుమార్, సుంకర ప్రదీప్తి, లక్ష్మీదేవి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ బట్టు మధు, జోన్ చైర్మన్ లుయడవల్లి సూర్యనారాయణ రెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి,చిత్రం విశ్వనాథం, వల్లూరి శ్రీనివాసరావు, మాల్యాద్రి, వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ సుబ్బారావు, నిమ్మగడ్డఅన్నపూర్ణ, నాగమణి, తిరుపతమ్మ, కుంకు శ్రీనివాసరావు, గుండ్రెడ్డి సైదిరెడ్డి, కాలం సైదులు, తదితరులు పాల్గొన్నారు