*భారత రెజ్లర్ సునీల్ కుమార్ కు కాంస్యం*
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ కాంస్యంతో మెరిశాడు. నిన్న జరిగిన గ్రీకో రోమన్ 87 కేజీల విభాగం కాంస్య పతక పోరులో అతడు 5–1తో జియాగ్జిన్ హంగ్ (చైనా)ను ఓడించాడు. ప్రస్తుత ఆసియా ఛాంపియన్షిప్లో భారత్ కు ఇదే
తొలి పతకం.