Wednesday, May 14, 2025
HomeTelanganaసీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులలో సిసి కెమారా పెట్టాలి… సీఐటీయూ డిమాంఢ్

తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ లో ప్రతి షెడ్ లో సిసి కేమెరాలు పెట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ నీ కోరారు..

మంగళవారం నాడు మార్కెట్ స్వీపర్లతో మార్కెట్
కార్యాలయముందు ధర్నా చేశారు…

ఈ సందర్భంగా నెమ్మాది మాట్లాడుతూ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో రైతుల దగ్గర కోని కాంట వేసి బస్తాలు కుట్టి షెడ్ లో పెట్టిన తర్వాత 39 ధాన్యం బస్తాలు
దొంగిలించారని దానికి కారణం స్వీపర్లు అని వారికి రావాల్సిన రోజూ వారి కూలీ
కమీషన్ దార్లు ఇవ్వకుండా పోయిన వడ్ల బస్తాలు దొరికిన తర్వాతనే మీ కూలీ ఇస్తా అని ఆపడం ఏమిటని నెమ్మాది ప్రశ్నించారు… ఒక్క షెడ్ కింద ఉండే ఇద్దరు మహిళా స్వీపర్లు 39 బస్తాలు దొంగతనం చేసే అవకాశం ఉంటుందా అని నెమ్మాది ఆన్నారు… ఖరీదు దారి గుమాస్తాలు, మిల్లు గుమాస్తాలకి తేల్వకుండా ఎలా బస్తాలు మాయం అయ్యయో ఇంత వరకు ఎందుకు మార్కెట్ సెక్రటరీ తేల్చడం లేదో చెప్పాలన్నారు… ఎవ్వరో చేసిన నేరానికి మహిళా స్వీపర్లను బాధ్యులను చేయడం అన్యయం అన్నారు… వెంటనే ప్రతీ సారి సీజన్ లో మార్కెట్ కు వచ్చే ధాన్యం బస్తాలు మాయం అవుతున్నాయని ధానికి కారణం స్వీపర్లని అనటం ఆనవాయితీగా వస్తోందని నెమ్మాది ఆన్నారు…
వెంటనే ధాన్యం బస్తాలు మాయం కావటం పై విచారణ చేసి దోసులని శిక్షించాలని నేమ్మాది డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో ఉపేందర్, జ్యోతి, గురవయ్య, సుశీలమ్మ, పద్మ,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments