*ఏపీలో సీనియర్ సిటిజన్లకు కొత్త పథకం*
అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. 70ఏళ్లు దాటిన వయో వృద్ధులకు రూ.5 లక్షల బీమా కల్పించనుంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పథకం కింద అమలు చేస్తారు. కేంద్రం వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ పథకం రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు.