హైదరాబాద్, :
ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత, పద్మభూషణ్ శ్యామ్ బెనగల్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలియజేశారు. చలన చిత్ర రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన శ్యామ్ బెనగల్ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. శ్యామ్ బెనగల్ కి హైదరాబాద్తో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఇక్కడే జన్మించి ఇక్కడే విద్యాభ్యాసం చేసిన శ్యామ్ బెనగల్ సినీరంగంలో ఏడుసార్లు జాతీయ స్థాయి అవార్డులతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకుని అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు. అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక వంటి మేటి చిత్రాలు రూపొందించి సినీ రంగంలోనే గొప్ప మార్పులు తెచ్చారని కొనియాడారు. శ్యామ్ బెనగల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.