Sunday, May 18, 2025
HomeTelanganaసింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు గుడ్‌న్యూస్.. ఈనెల 12 అకౌంట్లలో డబ్బులు జమ

రిటైర్డ్ కార్మికులు, అధికారులకు సింగరేణి సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగ విరమణ పొందిన సింగరేణి కార్మికులకు రూ. 33 కోట్ల లాభాల వాటా మంజూరైంది. ఈనెల 12న కార్మికుల ఖాతాల్లో లాభాల వాటా డబ్బులు జమ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల్లో దసరా బోనస్‌గా కార్మికులకు 33 శాతం వాటా లాభాల బోనస్‌ను ప్రభుత్వం ఇది వరకే ప్రకటించి పంపిణీ చేసింది. తాజాగా.. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 మధ్య రిటైర్డ్ అయిన వారికి లాభాల్లో వాటాగా రూ.33 కోట్లను చెల్లిస్తామని సంస్థ ప్రకటించింది.

ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభాలు రూ.4,701 కోట్లు కాగా.. ఇందులో రూ.2,412 కోట్లలో 33 శాతం కింద రూ.796 కోట్లను దసరా, దీపావళి బోనస్ కింద కార్మికులకు పంచారు. ప్రభుత్వ నిర్ణయంతో లాభాల వాటా కింద ఒక్కో కార్మికునికి సగటున రూ.లక్షా 90 వేలకు పైగా బోనస్‌ డబ్బులు అందాయి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు, ఒప్పంద కార్మికులకు సైతం రూ.5వేల బోనస్ అందించారు. తాజాగా.. రిటెర్డు కార్మికులకు కూడా లాభాల వాటను 33శాతం మంజూరీ చేసి పంపిణీ చేసేందుకు సంస్థ సిద్ధమైంది. ఈనెల 12న ఆయా కార్మికులు, అధికారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.

సింగరేణిలో పని చేసే ప్రతి ఉద్యోగి, కార్మికుడు సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సింగరేణి సీఎండీ యన్‌. బలరామ్ సూచించారు. ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణతో పని చేయాలని, నిర్దేశించిన విధుల సమయం 8గంటలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించినప్పుడే కార్మికులకు లాభాలు వస్తాయన్నారు. వార్షిక ఉత్పత్తి టార్గెట్ల సాధన కోసం ఉద్యోగులు, అధికారులు సమష్ఠిగా పని చేయాలని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటామని చెప్పారు. కార్మికుల, ఉద్యోగుల సంక్షేమం కోసం సింగరేణి సంస్థ పాటు పడుతుందని.. అందుకే లాభాల్లో పాటాలు పంపిణీ చేస్తున్నట్లు సీఎండీ బలరామ్ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments