*సాగునీటి కోసం రైతుల రాస్తారోకో*
ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. చేగుంట దౌల్తాబాద్ మండలల పరిధిలోని కసాన్ పల్లి, మాచిన్ పల్లి, పోతాన్ పల్లి, చందాయి పేట్ గ్రామాలకు చెందిన రైతులు రెండవ రోజు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుంచి తమ గ్రామాలకు సాగునీరు అందించేందుకు కాలువలు తవ్వి నీరు అందించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సాగునీరు లేక వందల ఎకరాలలో వరి పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు