నేరేడుచర్ల, కేకే మీడియా సెప్టెంబర్ 3
మండలంలోని ప్రాథమిక పాఠశాలల సముదాయ సమావేశాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల లో మంగళవారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు మధు,ఎల్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈవో పానుగోతు చత్రు నాయక్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదలకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయన్నారు. విద్యార్థులకు సరళ రీతిలో బోధించుటకు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవటానికి ఈ సమావేశాలు, దోహదపడతాయని, ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎం. ఎన్.ఓ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 19న 3, 6,9 తరగతుల విద్యార్థులకు నిర్వహించు ఎన్.ఎ.ఎస్ పరీక్షల కోసం విద్యార్థులను సంసిద్ధులను చేయాలని కోరారు. ఎఫ్ ఎల్ ఎన్, ఎన్ఏఎస్ లపై ఆర్పీలు
ఆర్. శ్రీనయ్య, పి. శ్రీధర్, ఎడవల్లి సత్యనారాయణ రెడ్డి శిక్షణ అందించారు. సీఆర్పీలు కె. శ్రీనివాస్ రెడ్డి,ఎం. పద్మ, ప్రవీణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.