Wednesday, May 21, 2025
HomeTelanganaసన్న వడ్లకు బోగస్ ఇస్తామని బోకాస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్...

సన్న వడ్లకు బోగస్ ఇస్తామని బోకాస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శ

సన్న వడ్లకు బోనస్ ఇస్తామని బోకాస్ మాటలు చెప్పిన కాంగ్రెస్
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శ

నేరేడుచర్ల ఏప్రిల్ 04 కేకే మీడియా
రైతులకు సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం బోకాస్ మాటలు చెప్పిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం
మండలంలోని మేడారం గ్రామంలో
శ్రీ సీతారామాంజనేయ జీవద్వజ, ముత్యాలమ్మ దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో పాడిపంటలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకున్నానని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్
దేవాలయాలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని నట్టేట ముంచిందని,బోనస్ ఇస్తామంటూ కాంగ్రెస్ బోగస్ మాటలు చెప్పిందని విమర్శించారు.రాష్ట్రంలో ఒక్క వరి గింజకు కూడా బోనస్ పడలేదని,తెలంగాణకి ఊపిరి అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాత్రికి రాత్రే విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ 10 ఏళ్లలో 7.5 శాతం గ్రీనరీ పెంచితే రేవంత్ ఒక్క రాత్రిలోనే 100 ఎకరాల్లో చెట్లని సమూలంగా తీసేశాడని, దీనిపై ప్రశ్నిస్తే విద్యార్థులను అని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. రైతుబంధు పడలేదని, రుణమాఫీ చేయలేదని, బోనస్ జాడే లేదన్నారు. ఇదేనా రైతు పట్ల మీకున్న విజ్ఞత అని ప్రశ్నించారు. మీరన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే కేటీఆర్ పై డ్రోన్ ఎగరవేత కేసు ఎలా పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు పంటలు పూర్తికాగా ధాన్యం ఎంత కొనుగోలు చేసింది లెక్కలేవన్నారు. వ్యవసాయ అధికారులు ఫోన్ చేస్తే స్పందనే లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం పంట కొనుగోళ్ళపై అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి, మంత్రుల్లో సంపాదన విషయంలో పోటీ ఉంది తప్ప పాలనపై దృష్టి లేదని విమర్శించారు. ప్రభుత్వం
ఏ ఎన్నికలు పెట్టినా ప్రజలు బుద్ధి చెప్పేది ఖాయమన్నారు ఎన్నికలకు పోయేందుకు కాంగ్రెస్ కు ధైర్యం లేదన్నారు. కులగణన విషయంలో బీసీలను మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బీసీలు కేసీఆర్ కే పట్టం కడతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనకు బిఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారని, అరెస్టులు లేకుండా పర్యటించే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలోబీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మారి పెద్ది శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, , డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జయ బాబు మాజీ మార్కెట్ చైర్మన్ ఇంజమూరి రాములు హుజూర్నగర్ మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు చెన్నబోయిన సైదులు, రాపోలు నవీన్ కుమార్, చిత్తలూరి సైదులు చిట్యాల శీను, బుడిగ సతీష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments