*విపత్తుల నివారణకు ఎస్ డి ఆర్ ఎఫ్ *ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి*
హైదరాబాద్,
:విపత్తు సమయాల్లో సుశిక్షితులైన బృందాలు తక్షణం రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా కొత్తరూపు సంతరించుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్ డి ఆర్ ఎఫ్ ) విభాగాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీలుగా ఆ విభాగానికి కొత్తగా సమకూర్చిన వాహనాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల వంటి విపత్తులను ఎదుర్కొనడానికి తరహాలో ఎస్డీఆర్ఎఫ్ను సిద్దం చేశారు. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్డీఆర్ఎఫ్ కోసం కొనుగోలు చేసిన అగ్నిమాపక, అత్యవసర అధునాతన వాహనాలను ప్రారంభించారు. ఈ దళానికి పలు పడవలను కూడా సమకూర్చగా, హుస్సేన్సాగర్లో ఆ బోట్ల ద్వారా ప్రదర్శన ఇచ్చారు. అనంతరం హోం శాఖ నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఎస్ డీఆర్ ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.