నేరేడుచర్ల, కేకే మీడియా
నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని దాసారం ప్రాథమిక పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు మంగళవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జిలకర రామస్వామి మాట్లాడుతూ మిర్యాలగూడకు చెందిన సుప్రియ డ్రెస్సెస్ వారి ఆర్థిక సాయంతో సుమారు
రూ.10,000 వేల విలువ గల నూతన వస్త్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. వారికి లయన్స్ క్లబ్ తరుపున ధన్యవాదాలు తెలిపారు.
లయన్స్ క్లబ్ సేవా భావంతో పనిచేస్తుందని, విద్య, వైద్య రంగాలతో పాటు నిరుపేదలకు సహాయ పడుతుందన్నారు.
విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలు శ్రద్ధగా విని ఇంగ్లీషు భాషను చక్కగా నేర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీణ రాణి, ఉపాధ్యాయులు బుర్రి పుల్లయ్య, ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, క్లబ్ సభ్యులు చిత్రం విశ్వనాథ్, ఉప్పాల లక్ష్మారెడ్డి, సరికొప్పుల నాగేశ్వరరావు, చిలక రాజు శ్రీను, గ్రామస్తులు రమ్య తదితరులు పాల్గొన్నారు.