తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది.కేంద్ర మంత్రివర్గం తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రద్దీని తగ్గించడంతోపాటు, యాత్రికులు, పర్యాటకులకు రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని మోదీ వివరించారు.ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో రైల్వే సదుపాయాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ. 1,332 కోట్లు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు.అంతేకాకుండా, ఇది వేలూరు, తిరుపతి వంటి విద్యా, వైద్య కేంద్రాలకు రాకపోకలను సులభతరం చేస్తుంది చిత్తూరు, తిరుపతి జిల్లాలకు, ఈ లైన్ కనెక్టివిటీ, అభివృద్ధి యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు
రైల్వే మార్గానికి కేంద్రం ఆమోదం…. సీఎం చంద్రబాబు
RELATED ARTICLES