Sunday, May 18, 2025
HomeTelanganaరేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు... పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం

రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు… పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం

హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 25
రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత ఉండాలి…

*గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల నేడు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ అప్పుల్లో కూరుకుపోయింది..

*రాష్ట్ర నీటిపారుదల శాఖ- పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటా మని అలాగే తెలంగాణ రాష్ట్రంలో 89లక్షల కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత ఉండాలని రాష్ట్ర నీటిపారుదల -పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాలను మంత్రి సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పలు కుటుంబాలకు అందజేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత ఉండాలని రేషన్ డీలర్లకు సూచించారు.ప్రభుత్వం కిలో బియ్యానికి 39 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని మిల్లర్లు గాని, ఎవరైనా రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్ల నేడు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ 56వేల కోట్ల అప్పుల్లో 11వేల కోట్ల నష్టాల్లో ఉందని అన్నారు.ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పోరేషన్ పై కేవలం వడ్డీ భారమే 3వేల కోట్లు ఉందని,రైస్ మిల్లర్ల దగ్గర ఇప్పటి వరకు 22వేల కోట్ల దాన్యం నిల్వలు గత ప్రభుత్వం పెట్టడంపై సమీక్ష జరుపుతున్నామని,సివిల్ సప్లైస్ డిపార్ట్ మెంట్ చేపడుతున్న ధాన్యం సేకరణ పద్దతులను,రేషన్ వ్యవస్థను మరింత మెరుగు పరిచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments