ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర హోంశాఖను సోమవారం అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఆ వివాదంపై ఏప్రిల్ 21న నాటికి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రాహుల్కు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందని, దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త శిశిర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.