Friday, March 21, 2025
HomeNationalరాష్ట్రానికి కేంద్ర సహకారం కోసమే ప్రధాని ని కలిసాం.. తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం

రాష్ట్రానికి కేంద్ర సహకారం కోసమే ప్రధాని ని కలిసాం.. తెలంగాణ సీఎం డిప్యూటీ సీఎం

ఢిల్లీ కేకే మీడియా డిసెంబర్ 26
ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్రానికి కేంద్ర సహకారం కోసం ప్రధాని మోదీని కలిశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
సమాఖ్య స్ఫూర్తిలో భాగంగానే ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశామని ఈ సందర్భంగా చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో *ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీకి సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.*
నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను సాధించటంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. *బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రధానితో చర్చించామని* ఈ సందర్భంగా వెల్లడించారు. *కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని* కోరామన్నారు. విభజన చట్ట ప్రకారం *ఒక మేజర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని* అడిగామన్నారు. *పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని* కోరామని తెలిపారు. పెండింగ్లో ఉన్న *ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని* కోరామని వివరించారు. *తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక స్కూల్ మంజూరు చేయాలని* అడిగామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments