Wednesday, May 21, 2025
HomeNationalమొదలైన సూర్యుడి ప్రతాపం

మొదలైన సూర్యుడి ప్రతాపం

*ఇక సూరీడు ప్రతాపం మొదలినట్టే……సూరీడుతో జర జాగ్రత్త.. ఇవ్వాల్టి నుంచి ఎండ తో చుక్కలేనట..!తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..*

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు.

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు..
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. నేడు 108 మండలాల్లో తీవ్రవాడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా -15, విజయనగరం జిల్లా-21, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3, తూర్పుగోదావరి-13, ఏలూరు-5, కృష్ణా -2 ఎన్టీఆర్-6, గుంటూరు-3, పల్నాడు-8 మండలాల్లో వడగాల్పులు (108) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..
ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా బయటకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments