మున్సిపాలిటీ కమిషనర్ కు అవార్డు రావడం పట్ల బిఎస్పి హర్షం
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే మీడియా జనవరి 27
నేరేడుచర్ల మున్సిపాలిటీ కమిషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లు కు జిల్లా ఉత్తమ కమిషనర్ గా కలెక్టర్ నుండి అవార్డు పొందండం పట్ల బిఎస్పి హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి రాపోలు నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్లు ను
బీఎస్పీ ఆధ్వర్యంలో శనివారం శాలువా కప్పి సన్మానించారు.
అనంతరం నవీన్ కుమార్ మాట్లాడుతూ
విధుల పట్ల అంకితభావానికి నిదర్శనమే ఈ అవార్డ్ అని,
ఉత్తమ సేవలందించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందడం సంతోషించదగిన విషయం అన్నారు.కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేంగ్ సెక్రటరీ పెద్దపంగ ఉపేందర్, నియోజకవర్గ అధ్యక్షుడు జిలకర రామస్వామి,పట్టణ అధ్యక్షుడు కర్రీ సతీష్ రెడ్డి, మండల అధ్యక్షుడు సురేష్ బాబు, తకెళ్ళనాగార్జున, అమరవరపు వెంకటేశ్వర్లు, బొజ్జా పవన్, బచ్చలకూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.