Dec 03, 2024,
ఆంధ్రప్రదేశ్ :
వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది.
ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆదివారాల్లోనూ క్లాసులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.
పరీక్షల కారణంగా సంక్రాంతి సెలవులను మూడు రోజులకు కుదించారు.