నేరేడుచర్ల కేకే మీడియా ఏప్రిల్ 19
గ్రామీణ మహిళలకు కుట్టు శిక్షణ ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బిక్కసాని కృష్ణకుమారి ట్రస్ట్ వైస్ చైర్మన్ లైన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు సుంకర క్రాంతి కుమార్ అన్నారు. పెంచికలదిన్నెలోని కృష్ణకుమారి ట్రస్ట్ భవన్లో నేరేడుచర్ల లైన్స్ క్లబ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ శిబిరాన్ని సీనియర్ లైన్స్ స్టెప్ సభ్యులు పోరేడి శ్రీరామ్ రెడ్డి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఒక్కరి సంపాదనతోనే కుటుంబం గడవడం కష్టంగా తయారైన ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇరువురు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద మహిళలు ఆర్థికంగా స్వసక్తితో ఎదిగేందుకు ఉపయోగపడే ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎడపల్లి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లైన్స్ పూర్వాధ్యక్షులు కందిబండ శ్రీనివాస్,బిక్కశాని కృష్ణకుమారి ట్రస్టు సభ్యులు సుంకర శ్రీరామ్మూర్తి, సంఘమందం నాయకురాలు ఆరిబండి సావిత్రి, లైన్స్ క్లబ్ కార్యదర్శి చల్లా ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రామస్వామి జిలకర లైన్ సభ్యులు, లక్ష్మారెడ్డి, విశ్వనాథం, గ్రామ కార్యదర్శి పోలిశెట్టి శ్రీనివాస్ లింగబోయిన రామకృష్ణ, ట్రైనర్ సావిత్రి శిక్షణకు వచ్చిన సభ్యులు పాల్గొన్నారు