మహాత్మా గాంధీ మనవరాలు మృతి
జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలు నీలాంబెన్ పారిఖ్(93) గతరాత్రి మరణించారు.
నవ్సరిలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఆమె మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ కుమార్తె.
నీలాంబెన్ అంత్యక్రియలు బుధవారం ఉదయం 8:00 గంటలకు వీర్వాల్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.