Wednesday, May 14, 2025
HomeTelanganaమళ్లీ వీఆర్వో వ్యవస్థ

మళ్లీ వీఆర్వో వ్యవస్థ

*తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ*

రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదివరకే కీలక ప్రకటన చేశారు.

సంక్రాంతిలోగా వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని చెప్పారు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన వీఆర్వోలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక రిక్రూట్ మెంట్ ద్వారా పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది వీఆర్వోలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని తెలుస్తోంది. 10,909 రెవెన్యూ గ్రామాలకు వీఆర్వోలను నియమిస్తారని సమాచారం. కాగా రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా జరుగుతోందంటూ రాష్ట్రంలోని వీఆర్వో వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

*గంతల నాగరాజు రిపోర్టర్*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments