Wednesday, May 21, 2025
HomeTelanganaప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ద్వారా విద్యాబోధన

ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ద్వారా విద్యాబోధన

*ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.*

విద్యాశాఖ బలోపేతం, నూతన విద్యా విధానం, తదితర అంశాలపై రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ యెగితారాణా, కమిషనర్ EV నర్సింహారెడ్డి,లు హైద్రాబాద్ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రోగ్రాం, క్వాలిటీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు,

ఈ సందర్భంగా యెగితా రాణా మాట్లాడుతూ SCERT తెలంగాణ ఆద్వర్యంలో సమగ్ర శిక్ష తెలంగాణ విద్యాశాఖ మౌళిక భాషాగణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో (FLN) లో కృత్రిమ మేథను ఉపయోగించి బోధన ను మెరుగుపరచడానికి axl , Ekstep ఫౌండేషన్ సహకారంతో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టు గా 6 జిల్లాల్లో ప్రారంభించిందని ,
ఆయా జిల్లాలలో మెరుగైన ఫలితాలు ఉన్నందున రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలలో కూడా ఈనెల 15 వ తారీకున ప్రారంభించాలని, సంకల్పించమని ,
ప్రతి జిల్లా నుండి ఒక క్వాలిటీ కంట్రోలర్, ఒక మండల విద్యాశాఖాధికారి , ఒక పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు మరియు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయుడు ఇలా ప్రతి జిల్లా నుండి నలుగురికి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చిందన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కలక్టరేట్ కలెక్టర్ సమావేశమందిరం జిల్లా కలేక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ , విద్యాశాఖ అధికారి ఆశోక్, జనార్దన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments