Monday, January 13, 2025
HomeTelanganaకుంగిన మేడిగడ్డ సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కుంగిన మేడిగడ్డ సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కేకే మీడియా
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తో కలిసి జరిగిన నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ , ఈ.ఎన్.సీ శ్రీ మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments