_పెద్దపల్లి, డిసెంబర్ 04_
* పెద్దపల్లి జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,సీఎం రేవంత్ రెడ్డి, వరాల జల్లు కురిపించారు.ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ వికాసం విజయో త్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరయ్యారు.
* బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. రూ.1000కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. యువ వికాస సభను జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు.
* అనంతరం 9వేల మంది నిరుద్యోగులకు నియామ కపు పాత్రలు అందించే కార్యక్రమంలో పదిమంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం ఏడు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్య మంత్రి బహిరంగ సభకు జిల్లా నుండి లక్ష మందికి పైగా జనం తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
*వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు:*
* జిల్లా పరిధిలో చేపట్టే రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 82 కోట్ల