పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి: ఆర్పీలు
నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 21
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా ) ఆర్ పి లకు 2023 జూన్ నుండి సెప్టెంబర్ వరకు నెలకు రూ.4,000 చొప్పున 2023 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు రూ.6,000 ల చొప్పున పెండింగ్ వేతనాలు ఇప్పించి తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆర్పీల సంఘం అధ్యక్షురాలు య లవర్తి కళ్యాణి, కార్యదర్శి తంగళ్ళపల్లి నాగలక్ష్మి, కోశాధికారి గుంటి రమ్య లు బుధవారం మున్సిపల్ చైర్మన్ బచ్చల కూరి ప్రకాష్, వైస్ చైర్మన్ సరితకు వినతి పత్రం అందజేశారు. మహిళా సంఘాల ద్వారా పొదుపు అలవాట్లను నేర్పి, వారికి బ్యాంకుల నుండి స్త్రీ నిధి ద్వారా ఋణాలు ఇప్పించి, 100% శాతము రికవరీలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రచారము చేయడముతో పాటు, వాటిని వారికి అందించడములో చాలా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి అవసరమైన అనేక సర్వేలను చేసి సమగ్రమైన సమాచారాన్ని అందిస్తున్నమన్నారు.