- నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 11
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఒక్క రోజే 14 మందిని కుక్కలు గాయపరచడం సంచలనమైంది. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలకు హాని కలుగుతుందని సోషల్ మీడియా ద్వారా అనేకమంది అధికారులకు విన్నపాలు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో సోమవారం నాడు ఒక్క రోజే పిచ్చి కుక్కలు 14 మందిని తీవ్రంగా గాయపరచడంతో వారంతా ఆసుపత్రి పాలయ్యారు.
చిన్నపిల్లలు వృద్ధులు వివిధ పనుల నిమిత్తం ఎక్కడికి వెళ్లాలన్నా కుక్కలతో భయాందోళన గురవుతున్న మునిసిపాలిటీ సిబ్బంది అధికారులు చూసీచూరినట్టు వ్యవహరిస్తూ వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పాలకమండలి అధికారులు మొద్దు నిద్ర వీడి వెంటనే చర్యలు చేపట్టి కుక్కలను పారద్రోలి ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు