*పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్*
తిరుమల :
ఏపీ అటవీశాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీ కు చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని పలువురు భక్తులు అభ్యంతరం చెబుతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునే ముందుకెళతామని DFO వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు.