సూర్యాపేట కేకే మీడియా జూన్ 23
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సిఐ నుంచి డిఎస్పి ప్రమోషన్లు కూడా వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 141 మంది సిఐలకు డిఎస్పిలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్పిలుగా ప్రమోషన్లు పొందిన వారందరికీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ జీవితంలో పదోన్నతి అనేది మరింత బాధ్యతను పెంచుతుందన్నారు. మంత్రిని కలిసిన వారిలో సూర్యాపేట రూరల్ చేయగా పనిచేస్తూ పదోన్నతి పొందిన సర్దార్ సింగ్, చిట్యాల సిఐ గా పని చేస్తూ పదోన్నతి సాధించిన శివరామిరెడ్డి, సూర్యాపేట ఎస్బిఐ గా పని చేస్తూ పదోన్నతి సాధించిన తుల శ్రీనివాస్ ఉన్నారు.