నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 12:
నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలో నూతన రామాలయ నిర్మాణ సన్నాహక ఏర్పాటు సమావేశాన్ని ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. గతంలో హుజూర్నగర్ రోడ్డులో ప్రధాన రహదారి వెంట ఉన్న రామాలయం పాతది కావడం స్థలం ఇరుకుగా ఉండడం ప్రస్తుతం ప్రధాన రహదారి హైవే కావడం దృష్టిలో ఉంచుకొని గ్రామ పెద్దలు గతంలో గుడి నిర్మాణం కోసం 10 కుంటల స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన కీర్తిశేషులు రాచకొండ సీతారామ నరసయ్య కుమారులు రామచంద్ర రావు , నాగేశ్వరరావు , కీర్తిశేషులు రాచకొండ రామారావు కుమారుడు నాగమదవ్ లను ఆలయ కమిటీ గ్రామ పెద్దలు రామాలయం నిర్మాణానికి స్థలం ఇవ్వాలని కోరగా అప్పటి 10 గంటలకు తోడుగా ఇంకొక ఎనిమిది గంటలు మొత్తంగా 18 గంటల స్థలాన్ని రామాలయ నిర్మాణానికి ఇవ్వడంతో గుడి నిర్మాణాన్ని నేరేడుచర్ల ఎమ్మార్వో ఆఫీస్ పక్కన ఉన్న స్థలంలో చేసేందుకు ఈరోజు నూతన గుడి నిర్మాణం సన్నాహకు సమావేశాన్ని నిర్వహించారు..
ఈ సందర్భంగా స్థల దాతలను సన్మానించి రానున్న రాముని కళ్యాణం ఇదే స్థలంలో జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయ బాబు మార్కెట్ చైర్మన్ శ్రీధర్ కౌన్సిలర్లు నాగయ్య కుంకు శ్రీను నారాయణ నగేష్ గ్రామ పెద్దలు కొనతం సత్యనారాయణరెడ్డి, రావులపల్లి ప్రసాద్ రాచకొండ రామన్న , ఆకారపు వెంకటేశ్వర్లు , కోనతం కృష్ణారెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ రాములు ,స్వామి