సూర్యాపేట కేకే మీడియా అక్టోబర్ 12:
సూర్యాపేట రిపోర్టర్ కంటు రామకృష్ణ:
దసరా పండగ ఉత్సవాల ముగింపు సందర్భంగా సూర్యాపేట పట్టణంలో శనివారం వంద మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సూర్యపేట డిఎస్పి రవి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డీజే లపై పూర్తి నిషేధం విధించారని ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జమ్మి ఉత్సవ ఊరేగింపుల, సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు పీఎస్ఆర్ నుండి ఈనాడు ఆఫీసు వరకు ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదని తెలిపారు. పండుగ రోజున వివాదాలు గొడవలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని అందరూ కలిసిమెలిసి సుఖసంతోషాలతో గడపాలని కోరారు.