Wednesday, May 21, 2025
HomeInternationalత్వరలో భారత్ కు సునీత విలియమ్స్

త్వరలో భారత్ కు సునీత విలియమ్స్

*త్వరలోనే భారత్ కు వస్తా: సునీత విలియమ్స్*

*అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్*

దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకు పోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలి యమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇటీవలే భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టారు.

తాజాగా నాసా నిర్వహిం చిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంతరిక్షంలో అనుభవాల ను వీరు పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందనే ప్రశ్నకు సమాధానంగా చాలా అద్భుతంగా కనిపించిందని సునీత చెప్పారు.

తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతి సారి… మంచు పర్వతాల అందాలను విల్మోర్ కెమెరాలో బంధించారని సునీత తెలిపారు.

హిమాలయాలు అత్య ద్భుతం అని చెప్పారు. గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీద నుంచి వెళుతున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకా రుల పడవలు తమకు సిగ్నల్ మాదిరి పని చేసేవని అన్నారు.

భారత్ కు వచ్చే అంశం గురించి సునీత మాట్లాడు తూ… తన తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే వెళ్లాల నుకుంటున్నానని చెప్పారు. ఇండియాలో ఉన్న బంధు వులు, ప్రజల తో ముచ్చటిం చాలని… వారితో తన అను భవాలను పంచుకోవాలని ఉందని అన్నారు.

భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. అంతరిక్ష రంగంలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న దేశమని కితాబునిచ్చారు. తనలో భారత్ మూలాలు ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments