*తెలంగాణాలో సూర్యుడు భగ.. భగ..:* తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) అంచనా ప్రకారం, రానున్న మూడు నెలల్లో, ముఖ్యంగా ఏప్రిల్ మరియు మే నెలల్లో, ఉష్ణోగ్రతలు 42°C నుండి 46°C వరకు చేరుకునే అవకాశం ఉంది.
మార్చి 13న మెదక్లో అత్యధికంగా 38.6°C ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 4°C వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం, ప్రజలు తీవ్ర ఎండల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో మరింత వేడి పరిస్థితులు ఎదుర్కోవచ్చు.