హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 9
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారాన్ని చేజెక్కించుకున్న తర్వాత జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటూ వచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర పార్టీగా పేరు బడి నా 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్షంగా నిలిచిన అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ వలసలను ప్రోత్సహించడంతో ఒక్కరొక్కరుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అధికార పార్టీలో చేరగా మరికొందరు కాంగ్రెస్లో చేరారు .
ఇంకొందరు మాత్రం తెలుగుదేశాన్ని నమ్ముకొని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ పార్టీకి వెళ్లకుండా తలుస్తంగా ఉంటూ జాతీయ అధ్యక్షుని ఆదేశాలతో పని చేస్తూ వస్తున్నారు
గ్రామీణ స్థాయిలో మంచి గుర్తింపై ఉన్నప్పటికీ పదేళ్లు అధికారంలో లేకపోవడం చంద్రబాబు కేవలం ఆంధ్ర రాజకీయాలపైనే ఎక్కువగా సమయం కేటాయించడంతో క్రమక్రమంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ తగ్గుతూ వచ్చింది.
ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు పార్టీ అభిమానం తో పాటు వ్యక్తిగత అభిమానంతో రాజకీయంగా తెలుగుదేశాన్ని నమ్ముకొని ఉంటూ వచ్చిన క్యాడర్ అధినేత తెలంగాణలోనూ పార్టీ విస్తృత పై చర్యలు తీసుకోవాలని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కోరిన అధ్యక్షుడు మాత్రం ఆంధ్ర రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెడుతూ తెలంగాణ లో పార్టీ కి ఎంత మాత్రము సమయము ఇవ్వకపోవడంతో కొంత నైరశంలోకి వెళ్లిన పార్టీ శ్రేణులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారీ ఆదిత్యంతో అధికారాన్ని చేజిక్కించుకొని నాలుగో సారి ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పగ్గాలు చేపట్టడం తోపాటు తెలంగాణలోనూ పార్టీని విస్తరించాలన్న ఆలోచనతో ఇప్పటికే పలమార్లు తెలంగాణ నేతలతో చర్చలు జరిపి నూతన అధ్యక్షుడు ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం 10 సంవత్సరాలు అధికారాన్ని చలాయించిన బిఆర్ఎస్ అసెంబ్లీ ఓటమితో కోలుకోలేని దెబ్బ తగలగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ఒక్కరొకరుగా పార్టీని వీడి అధికార కాంగ్రెస్లో చేరుతుండడం గ్రామీణ స్థాయిలో సైతం పార్టీ పట్టు కోల్పోతూ వస్తున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో క్యాడర్ నైరాశ్యం లో ఉండడం , పలు కేసులతో పార్టీ అగ్ర నేతలు సతమతమవుతుండటం, బిజెపిలో విలీనం అవుతుందన్న వదంతులు రావడంతో గతంలో తెలుగుదేశం శ్రేణులు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావాలన్న ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సమర్థుడైన నాయకత్వాన్ని తెలంగాణలో నియమిస్తే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని, తెలుగుదేశం అభిమానులు భావిస్తున్నారు.
ఇక చంద్రబాబు కూడా ఆంధ్రాలో పటిష్టంగా పార్టీ , అధికారం ఉంది కాబట్టి
ఇక తెలంగాణలో నూ పార్టీని పటిష్టపరిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేడర్ కు ఇప్పటికే సంకేతాలు అందించిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి అధికారంలోకి తెచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
నేడో ,రేపో తెలంగాణ రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి కమిటీల నియామక అనంతరం జాతీయ పార్టీ అధ్యక్షుడు నియమించే కమిటీ పైనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారం పడనుంది.
అన్ని సవ్యంగా జరిగితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం ఎవరు ఆపలేరు.