తెలంగాణపై ప్రధాని చిన్నచూపు: ఓవైసీ
TG: తెలంగాణపై ప్రధాని మోదీ చిన్నచూపు చూస్తున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలు ఇస్తే ప్రధాని మాత్రం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కామెంట్ చేశారు.