Sunday, May 18, 2025
HomeTelanganaతప్పుడు కేసులు ఎన్ని పెట్టిన ప్రజల పక్షానే ఉంటా మాజీ మంత్రి హరీష్ రావు

తప్పుడు కేసులు ఎన్ని పెట్టిన ప్రజల పక్షానే ఉంటా మాజీ మంత్రి హరీష్ రావు

అడుగడుగునా అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదైన కేసుపై సామాజిక మాధ్యమం ద్వారా ఆయన స్పందించారు.

సీఎం రేవంత్‌రెడ్డి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు పెట్టించడం అని ఆక్షేపించారు. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేశారని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించారని, ఇచ్చిన హామీలను ఎగవేస్తున్నారని అన్నందుకు బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించారని హరీశ్‌రావు తెలిపారు. సోషల్‌ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో తనపై కేసు పెట్టించారన్నారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకి.. మానకొండూరులో అక్రమ కేసు పెట్టించారని పేర్కొన్నారు. సీఎం రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్ట

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments