Friday, March 21, 2025
HomeTelanganaట్రాక్టర్ టైర్ కింద పడి వ్యక్తి మృతి

ట్రాక్టర్ టైర్ కింద పడి వ్యక్తి మృతి

పాలకీడు కేకే మీడియా జూన్ 25

ట్రాక్టర్ టైర్ కింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామంలో ఆదివారం జరిగింది.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలంలోని కీతవారిగుడెం గ్రామానికి చెందిన తవిడబోయిన. శ్రీరామ్ (22) అతని అమ్మమ్మ ఊరైనా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ లో తన తాతయ్య అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.

అయితే ఆదివారం వ్యవసాయ పనులలో భాగంగా నారుమడి దున్నేందుకు తన మేనమామకు చెందిన ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి సైదులు అనే రైతు పోలం దున్నుతున్న సమయంలో శ్రీరామ్ కు పిట్స్ వచ్చి ట్రాక్టర్ మీద నుండి క్రింద పడ్డాడు.

దాంతో ఆ ట్రాక్టర్ పెద్ద టైరు శ్రీరామ్ ముఖం చాతిభాగం పై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీరామ్ ముఖం చాతి భాగాన బలమైన గాయాలు ఏర్పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులైన తవిడబోయిన వెంకటేశ్వర్లు పద్మతో పాటు శ్రీరామ్ అక్కకూడ వేరువేరు కారణాలతో గతంలోనే మృతి చెందారు. మృతుని తాతయ్య సైదులు ఇచ్చిన ఫిర్యాదుకు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పాలకవీడు ఎస్సై లింగయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments