టోల్గేట్ ఎత్తి వేయాలి…
20 కిలోమీటర్లు పరిధి వరకు ఉచిత ప్రయాణం అందించాలి
నేరేడుచర్ల
చిల్లేపల్లిలో జాతీయ రహదారి కోసం నిర్మించిన టోల్ గేట్ నువ్వు పూర్తిగా ఎత్తివేయాలని. సాధ్యం కానీ ఎడల టోల్గేట్ పరిధిలో 20 కిలోమీటర్ల దూరంలోని వాహనదారులందరికీ ఉచిత టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించాలని కోరుతూ నేరేడుచర్ల మండలం వాహన యజమానులు బుధవారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
మండల అన్ని పార్టీల అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాలో నాయకులు మాట్లాడుతూ జీవితకాలపు రోడ్ టాక్స్ కట్టిన వాహనాలకు టోల్ గేట్ ద్వారా రోడ్డు ప్రయాణానికి ఫీజులు వసూలు చేయడమేంటని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం టోల్గేట్ వసూలు చేసిన టోల్గేట్ పరిధిలోని 20 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాల వాహనదారులు నిత్యం రకరకాల పనుల నిమిత్తం మిర్యాలగూడ కు వెళ్లి వస్తూ ఉంటారని డీజిల్ చార్జీలకంటే టోల్ చార్జీలు అదే మొత్తంలో చెల్లించాల్సి రావడం బాధాకరమని ఆర్థిక భారం అవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో టోల్ రుసుము లేకుండా ప్రయాణం అందించాలని యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని లేనియెడల అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామనే చరించారు
ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పార్టీల కిలపక్ష నేతలు వాహన యజమానులు భార్య సంఖ్యలో పాల్గొన్నారు.
ధర్నా సందర్భంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పోలీసులు ధర్నాను నియంత్రించాలని, లగ్నం చేయాలని ప్రయత్నం చేసిన పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.
పోలీసులు యాజమాన్యంతో చర్చలకు చొరవ చూపగా నేరేడుచర్ల పట్టణ వాహనదారుల వరకు తోలు రుసుము తీసుకోమని హామీ ఇచ్చారు.