న్యూఢిల్లీ కేకే మీడియా ఫిబ్రవరి 20
ఛత్తీస్ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోమవారం ఉదయం 14 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈడీ దాడులు చేసిన వారందరూ ఛత్తీస్ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సన్నిహితులని సమాచారం.
కోల్ లెవీ స్కాంలో కొందరు రాజకీయ నేతలు, అధికారులు 540 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.

