Wednesday, May 21, 2025
HomeTelanganaఘనంగా పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

ఘనంగా పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

నేరేడుచర్ల, కేకే మీడియా
మండలంలోని దిర్శించర్ల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ పి.సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు తమ అనుభవాలను ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న విషయాలను ఉపాధ్యాయుల పట్ల గౌరవం, క్రమశిక్షణతో మంచి విద్యాభ్యాసాన్ని పొందినట్టు తెలిపారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ జరగబోవు 10వ తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలతో పాటు మండల స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండాలని కోరారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ మామిళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీనివాసరావు,
జె. శ్రీనివాస్, చల్లా ప్రభాకర్ రెడ్డి, అశోక్, విజయకుమార్, సైదాబి, నూర్జహాన్,పిడి శ్రీనివాస్, నెల్సన్, రాములు, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments