నేరేడుచర్ల, కేకే మీడియా
సూర్యాపేట జిల్లాఎస్పీ
కె. నరసింహ ఆదేశాల మేరకు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి మహాత్మ జ్యోతిరావ్ ఫూలే గురుకుల పాఠశాల, కళాశాలలో మంగళవారం సైబర్ నేరాలు,మహిళల భద్రత, షీ టీమ్స్,గంజాయి, డ్రగ్స్, మత్తుమందులపై,రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళా బృందాలతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రవీందర్ నాయక్ మాట్లాడుతు జిల్లా ఎస్పి కె.నరసింహ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, మహిళల భద్రత,గంజాయి, డ్రగ్స్ మత్తు మందులు,గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామన్నారు.సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దని, బ్యాంక్ ఖాతా,ఎటిఎం కార్డ్ వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దన్నారు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దని,బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలని తెలిపారు.
మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దన్నారు. సైబర్ మోసాలపై1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నియమ నిబంధనలు తెలుసుకోవాలన్నారు. అతివేగంగా ప్రయాణించవద్దని పేర్కొన్నారు. వేధింపులకు గురి చేస్తే 100కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీ లుగా పెట్టుకోవద్దని సూచించారు. మొబైల్ యాప్ లలో వచ్చే అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దని హితవు పలికారు. గంజాయి, మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.అనంతరం పోలీసు కళబృందంతో సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అనుకరణ, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య,చారి, గురులింగం,నాగార్జున, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.