గరిడేపల్లి కేకే మీడియా నవంబర్ 4
రానున్న హుజూర్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో గరిడేపల్లి మండలం నుంచి భారతీయ జనతా పార్టీ ఆదిక్యం సాధించే దిశగా నాయకత్వం ముందుకెళ్తోందని భాజపా అసెంబ్లీ అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల బూత్ కమిటీ అధ్యక్ష – కార్యదర్శులు, శక్తి కేంద్ర ఇన్చార్జులుతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో,. కపట నాటకాలతో కాలం వెళ్లదీస్తున్న మాయల పకీరు ప్రభుత్వాన్ని పాతాళంలో బొంద పెడదామన్నారు. ఎలక్షన్లో భాజపా కార్యకర్తలు బోర్డర్ లోని సైనికుల్లా సాయి జెండా రెపరెపలాడించడానికి సర్వశక్తులోడ్డాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఇంచార్జ్ ఎమ్మెల్సీ రవికుమార్, అసెంబ్లీ ప్రబారి ఇ వి రమేష్, జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి,. జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు అంబాల నరేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, మేకల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు నర్సింగ్ అంజయ్య,. అధ్యక్షులు షేక్ కేంద్ర ఇన్చార్జులు మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.*