Sunday, May 18, 2025
HomeTelanganaగంజాయి,డ్రగ్స్, సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

గంజాయి,డ్రగ్స్, సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

గంజాయి,డ్రగ్స్, సైబర్ నేరాల పై అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా డిసెంబర్ 30

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువత పూర్తి అవగాహనతో జాగ్రత్తలు తీసుకోవాలని నేరేడుచర్ల ఎస్సై పరమేష్ కోరారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు, కోదాడ డి.ఎస్.పి ప్రకాష్,సీఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో నేరేడుచర్ల ఎస్సై పరమేష్, మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలు, డ్రగ్స్, మత్తు మందులు, గంజాయి నిషేధం, సోషల్ మీడియా పైన, మహిళలు, పిల్లల భద్రత గురించి, పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం పోలీస్ కళాబృందం చేత షీటీమ్స్, మహిళల భద్రత రక్షణ,100 డైల్ గురించి, సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాలు , పిల్లల పైన సోషల్ మీడియా ప్రభావం,విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆట, పాటల ద్వారా విద్యార్థిని, విద్యార్థిను లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు, స్థానిక కౌన్సిలర్ అమరారపు లలిత భరత్, కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపల్ మురారి శెట్టి రమేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య,చారి,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments