**కోదాడలో ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునీకరిస్తాం*
**కోదాడ నుండి హైదరాబాద్ కు ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తాం*
**డిపోలో బస్సుల సంఖ్యను పెంచుతాం.*
**సంవత్సరంలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా 116 కోట్ల మంది మహిళలు ప్రయా ణించారు*
**రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.*
**మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో కలిసి బస్టాండు పరిశీలన*
**20 కోట్ల తో కాపుగల్లు రెడ్ల కుంట డబల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన*
*చిలుకూరు వద్ద 250 కోట్లతో ఇంటర్కేటెడ్ పాఠశాలకు శంకుస్థాపన*
కోదాడ,
కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునీకరించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం రాత్రి కోదాడ బస్టాండ్ ను, డిపోను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోరిక మేరకు అవసరమైతే బస్టాండ్ నుండి కొత్తగా నిర్మిస్తామని, కోదాడ డిపో నుండి హుజూర్నగర్ మీదుగా హైదరాబాద్ కు ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే కోదాడ నుండి ప్రధాన రహదారిపై మరో బస్సు ని నడుపుతామన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆదరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఇచ్చిన ఆమె మేరకు ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణంగా సంవత్సర కాలంలో 116 కోట్ల మంది ప్రయాణించారని, అందుకు ప్రభుత్వం 4000 కోట్ల రూపాయలను ఆర్టీసీ సంస్థకు చెల్లించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అనంతరం ఆర్టీసీ క్యాంటీన్లో చాయ్ తాగారు.అంతకుముందు చిలుకూరు మండలంలోని మిట్స్ కాలేజ్ ఎదురుగా గుట్టల్లో 250 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇంట్రీగేటెడ్ పాఠశాలకు ఉత్తంకుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యను బలోపేతం చేసేందుకు పాఠశాలలు నియోజకవర్గానికి ఒకటి నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కోదాడ మండలం కాపుగల్లు నుండి రెడ్ల కుంట వరకు 20 కోట్లతో చేపట్టిన డబల్ రోడ్డు రహదారి పనులను మంత్రులు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీరయ్య, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు, పారా సీతయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావు, అన్ని మండలాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, కోదాడ మున్సిపల్ కౌన్సిలర్లు, చిలుకూరు మండల నాయకులు జనపనేని కృష్ణారావు, వేమూరి సురేష్, ఒట్టికూటి నాగయ్య, బొలిశెట్టి నాగేంద్రబాబు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.