Sunday, May 18, 2025
HomeTelanganaకొండముచ్చు ఎలా మాయమైంది

కొండముచ్చు ఎలా మాయమైంది

నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 13

మున్సిపాలిటీలో సాధారణ నిధుల నుండి 20000/- వెచ్చించి కొనుగోలు చేసిన కొండముచ్చు ఎక్కడుందని 8 వ వార్డు కౌన్సిలర్ కో
దమగుండ్ల సరిత మున్సిపల్ కమిషనర్ ని ప్రశ్నించారు. బుధవారం 8వ వార్డు పాత నేరేడుచర్ల పరిధిలో కోతులు ఇండ్లలో సంచరిస్తూ పిల్లలను మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భంలో స్థానిక ప్రజల ఇబ్బందులు గమనించిన ఆమె బుధవారం నాడు ఇటీవల కొనుగోలు చేసిన కొండముచ్చును పంపించవలసిందిగా కమిషనర్ ని కోరగా ఆయన ఎక్కడ ఉందో తనకు తెలియదని వివరణ ఇచ్చారని ఆమె వాపోయారు. గత కౌన్సిల్ సమావేశంలో 18 వ అంశముగా చేర్చి తీర్మానాన్ని ఆమోదింప చేసుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తీర్మానాల్లో ఆమోదింపజేసినట్లుగా చెబుతున్న 20వేల రూపాయల పెట్టి తీసుకొచ్చిన కొండముచ్చు అది కాగితపు లెక్కలకే పరిమితమైందా లేక నిజంగానే కొన్నారా! అని సందేహాన్ని ఆమె వెలిబుచ్చారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో కుక్కల సంచారం కోతుల సంచారం ఎక్కువైందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని పాలకులకు ఈ విషయం పట్టదా అని ప్రశ్నించారు. త్వరితగతిన నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ ను డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments